హైదరాబాద్ లో 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్

హైదరాబాద్ లో 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్

గోదావరి మెయిన్ పైప్​లైన్ లీకేజీ రిపేర్లు చేపట్టనున్న వాటర్ బోర్డు


సికింద్రాబాద్​, వెలుగు: ఈ నెల19న ఉదయం 6 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు వాటర్ బోర్డు డివిజన్ల పరిధిలోని  కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం  కలగనుందని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-–1లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్ పైపులైన్ కు ఏర్పడ్డ  లీకేజీలను అడ్డుకునేందుకు అధికారులు రిపేర్ పనులు చేపడుతున్నారు.  


ఈ కారణంగా రెండ్రోజుల పాటు గ్రేటర్ సిటీలో తాగునీటి సరఫరా ఉండదన్నారు. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని  ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరినగర్, ప్రగతినగర్ లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో  నీటి సరఫరాలో పాక్షికంగా అంతరాయం ఉంటుందన్నారు. --కూకట్ పల్లి డివిజన్ ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్, కుత్బుల్లాపూర్ డివిజన్​షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి పరిధి సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, కాప్రా మున్సిపాలిటీలోని సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, నాగారం, దమ్మాయిగూడ , రాంపల్లి,కీసర ,బొల్లారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట, ప్రజ్ఞాపూర్​, గజ్వేల్, ఆలేరు, శామీర్​పేట, మేడ్చల్,  కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా ఉండదని చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.