
హైదరాబాద్ రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. వీకెండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీ లో డీజే గౌరవ్ 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో హోర్రెతించారని నిర్ధారించారు. గోవా నుండి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు తేల్చారు పోలీసులు.
పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. గౌరవ్ తో కోడ్ లాంగ్వాజిలో డ్రగ్స్ కొరకు కస్టమర్స్ చాటింగ్స్ చేశారని పోలీసులు నిర్ధారించారు. డీజే గౌరవ్ కు హైదరాబాద్ లో ప్రముఖుల కాంటాక్ట్స్ పై విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు పార్టీ లో 26 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పబ్ ఓనర్స్ ముగ్గురు పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఇందులో పెద్దవారు ఎవరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.