రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సీజ్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్  సీజ్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సప్లయ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎల్బీనగర్, మహేశ్వరం, చౌటుప్పల్ లా అండ్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో, నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్, ముగ్గురు వినియోగదారులు పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి ఒకటిన్నర కేజీల ఓపియం డ్రగ్, 24 గ్రాముల హెరాయిన్, ఐదు కేజీలు పోపీ స్ట్రా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కంటైనర్, టూవీలర్, 8 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. బాలాపూర్, మీర్ పేట్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి రాచకొండ SOT పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.