శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1389 గ్రాముల హెరాయిన్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1389 గ్రాముల హెరాయిన్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జోహనెస్ బర్గ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 11 కోట్ల 53 లక్షల విలువైన డ్రగ్స్ పట్టకున్నారు. టాంజానియాకు చెందిన ప్యాసింజర్ నుంచి 1,389 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. నిందితుడు 108 క్యాప్సిల్స్ మింగినట్లు గుర్తించారు అధికారులు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచాక నిందితుడికి ట్రీట్మెంట్ అందించారు అధికారులు. డాక్టర్ల పర్యవేక్షణలో నిందితుడి నుంచి క్యాప్యూల్స్ బయటికి తీశారు. గత నెల 26న అనుమానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 రెండు రోజుల క్రితమే సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్కు బిజినెస్ వీసాపై వచ్చిన వ్యక్తి నుంచి 4 కిలోల కొకైన్ సీజ్ చేశారు. అంగోలా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ నుంచి మరో 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడ్డ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.