వాడు సినిమా తీసేలోపు..అసలు సినిమా చూపిద్దాం

వాడు సినిమా తీసేలోపు..అసలు సినిమా చూపిద్దాం

విక్టరీ వెంకటేష్, మీనా నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం–2 ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ విషయానికొస్తే..దృశ్యంలాగే బ్యాక్ గ్రౌండ్ సౌండ్..సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉంది. ఫ్యామిలీ కోసం రాంబాబు ఏం చేశాడనేది బాగా చూపించారు.  " ఇప్పుడు రాంబాబు ఫోకస్ మొత్తం సినిమా తీయడం మీద ఉంది. చట్టానికి దొరకన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వాడు సినిమా తీసేలోపు..వాడికి సినిమా చూపిద్దాం. అనే డైలాగ్స్ బాగున్నాయంటున్నారు ఫ్యాన్స్.  దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ మూవీని మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించగా..నదియా, నరేష్, కృతిక, ఈస్తర్, అనిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించినా ఈ సిని మా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25న రిలీజ్ కానుంది.