
ఉత్తరప్రదేశ్ లోని దుద్వా టైగర్ రిజర్వ్ లోని సుహేలీ నది పరిహక ప్రాంతంలో పరిశోధకులు ఓ అరుదైన కప్పను కనుగొన్నారు. కప్పలు పసుపు, గ్రే, గ్రీన్, ఎల్లో కలర్లో ఉంటాయి. కానీ పూర్తిగా తెలుపు రంగులో ఉన్న కప్పలు మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. అయితే పరిశోధకులు హప్లోబాట్రకస్ టైగెరినస్ అనే ఇండియన్ బుల్ ఫ్రాగ్ జాతిలో అరుదైన తెల్ల కప్పను గుర్తించారు.
దేశంలో కనిపించిన తొలి తెలుపు రంగు కప్ప ఇదే. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ హప్లోబాట్రకస్ టైగెరినస్ జాతి కప్పలు సైజులో పెద్దగా ఉంటాయని తెలిపారు. మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన స్వస్థిక్ పీ పాధీ, TERI స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు చెందిన హర్షిత్ చావ్లా ఈ పరిశోధనలో పాల్గొన్నారు.