భర్త వదిలేసాడని అడుక్కుంటే.. పోలీసులు అరెస్ట్ చేశారు

భర్త వదిలేసాడని అడుక్కుంటే.. పోలీసులు అరెస్ట్ చేశారు

భర్త వదిలేసాడని, పిల్లలు ఉన్నారని… బతకడానికి కష్టమవుతుందటూ ఆన్ లైన్ లో ఆర్థిక సహాయం కోరింది ఓ మహిళ. ఆమె పడుతున్న కష్టానికి ఆన్ లైన్ జనాలు కరిగిపోయారు. దీంతో ఆమెకు ఫండింగ్ ఇచ్చారు. ఇలా 17రోజుల్లోనే 50వేల డాలర్లు సంపాదించింది. ఈ ఘటన సౌదీలో జరిగింది. అయితే అసలు నిజం ఏంటంటే ఆమె తనకు  లేని కష్టాన్ని ఉన్నట్లు చెప్పి అందరిని మోసం చేసింది.

ఆ మహిళ ఆన్ లైన్ లో ఆర్థిక సహాయంకోరగా.. ఆమెను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దుబాయ్ లో అడుక్కోవడం చట్టరిత్యా నేరం(ఆన్ లైన్ లో అయినా సరే). దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో నిజాలు బయటపడ్డాయి. ఆమెను భర్త వదిలేసిన మాట వాస్తవమేనని అయితే పిల్లలు మాత్రం వాళ్ల తండ్రి దగ్గరే ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

ఆ మహిళ మాత్రం పిల్లలను పెంచేందుకు సహాయం చేయాలంటూ ఆన్ లైన్ లో కోరింది. దీంతో లక్షా 83వేల 500 దిరమ్స్‌ను ఆమెకు డోనెట్ చేశారు. ఈ విషయం పై పోలీసులు అక్కడి సిటిజన్స్ ను అలెర్ట్ చేశారు. దుబాయ్ లో అడుక్కోవడం నేరం అని తెలిపారు. సౌదీ చట్టాల ప్రకారం అక్కడ ఎవరైనా అడుక్కుంటే వారికి 50,000 నుంచి  2,50,000 దిరమ్స్‌ వరకు జరిమానా వేస్తామని చెప్పారు.