మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత

మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత

వరంగల్ : పాలకుర్తి మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 09 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలిపారు.