యాదాద్రి, వెలుగు : మహిళా సంఘాలు తీసుకున్న లోన్ల దుర్వినియోగంపై విచారణ మొదలైంది. ఇందులో భాగంగా భువనగిరి టౌన్కు సంబంధించిన సంఘాల పరిస్థితిపై యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఎ భాస్కరరావు సోమవారం మీటింగ్ నిర్వహించారు.
టౌన్లోని 1200 సంఘాలు తీసుకున్న లోన్లపై ఆరా తీశారు. ఈ మీటింగ్కు 46 మంది రిసోర్స్ పర్సన్లు హాజరుకాగా .. లోన్ల దుర్వినియోగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆర్పీలు రాలేదు. వీరిలో ఒకరిపై ఇప్పటికే భువనగిరి టౌన్లో కేసు నమోదు అయిందని ఆఫీసర్లు చెప్పారు.
మరో ఇద్దరు పర్యవేక్షిస్తున్న సంఘాల లోన్ల లావాదేవీలు పరిశీలించి, దుర్వినియోగం అయినట్టుగా తేలితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. పట్టణంలోని 1200 సంఘాలకు సంబంధించిన లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. అదే విధంగా ఆరుగురు మెంబర్లతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మీటింగ్లో ఎల్డీఎం శివరామకృష్ణ, మెప్మా ఆఫీసర్ రమేశ్ బాబు, డీపీఎం ప్రభాకర్, కెనెరా బ్యాంక్ మేనేజర్ మెతిన్ రాజ్ ఉన్నారు.
