వరంగల్లో భూకంపం..పరుగులు తీసిన జనం

వరంగల్లో భూకంపం..పరుగులు తీసిన జనం

వరంగల్ లో ఆగస్టు 25వ తేదీ  శుక్రవారం తెల్లవారుజామున  భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 4 :43 గంటలకు భూకంపం సంభవించింది. భూ కంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోపల కదలికలు సంభవించినట్లు ప్రకటించింది. 

తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో  భూమి కంపించడంతో  ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలా మంది బయపడిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి  నష్టం సంభవించలేదు.