బెంగళూరులో భూకంపం

బెంగళూరులో భూకంపం

కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం సంభవించింది. ఇదే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ధ్రువీకరించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై 3.3 భూకంప తీవ్రత నమోదయ్యిందని ఓ ప్రకటనలో పేర్కొంది. "బుధవారం అనగా 22 డిసెంబరు 2021 తెల్లవారుజామున 7.14 గంటల సమయంలో బెంగళూరులో భూకంపం సంభవించింది" అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఈ భూకంపంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఏదైనా నష్టం వాటిల్లిందా అనే వివరాలు రావాల్సి ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

పార్లమెంట్ ప్రొసీడింగ్స్​ను లైవ్​లోచూసేందుకు యాప్

కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు