
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రొసీడింగ్స్ను లైవ్లో చూసేందుకు ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్ను తయారు చేయించింది. సెషన్స్ లైవ్ టెలీకాస్ట్, వివిధ పార్లమెంటరీ పత్రాలు, రాతపూర్వక ప్రశ్నలు, -సమాధానాలు, వివిధ కమిటీల రిపోర్ట్స్ అన్నీ ఉండే యాప్ను మంగళవారం లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. అనంతరం క్వశ్చన్అవర్లో యాప్ ఫీచర్లు, దాని ఉపయోగాలను హౌస్లో ఎంపీలకు వివరించారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని.. ప్రజలు కూడా అవగాహన కల్పించాలని స్పీకర్ ఎంపీలకు సూచించారు. ఈ యాప్లో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఎంపీల పనితీరును చూసే అవకాశం ఉంటుందని చెప్పారు.