న్యూజిలాండ్లోని కెర్మాడెక్ దీవులు రీజియన్ లో ఏప్రిల్ 24 సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.11 గంటలకు భూకంపం సంభవించింది.
10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు యూఎస్జీఎస్ అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే న్యూజిలాండ్ తీరంలో అలలు పోటెత్తాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీని గురించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో న్యూజిలాండ్ లో కెర్మాడెక్ దీవుల్లో 7.1తీవ్రతతో భూకంపం వచ్చింది.