పాలమూరులో 14 సీట్లలో బీజేపీని గెలిపిస్తరు

పాలమూరులో 14 సీట్లలో బీజేపీని గెలిపిస్తరు

ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్నోళ్లెవ్వరూ బాగుపడలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో 317 జీఓ కు నిరసనగా.. ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలపై నిరసన సభ నిర్వహించారు. బండి సంజయ్.. ఈటెల రాజేందర్.. డీకే అరుణ.. జితేందర్ రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఈటల.. ఆలంపూర్ నుంచి అదిలాబాద్ దాకా ఒకటే నినాదం ఉందని.. సీఎం కేసీఆర్ ను దించడమే లక్ష్యమని అన్నారు. రైతు ఉత్సవాల్లో ఒక్కరు లేరని.. కేసీఆర్ వెంట ఏ కులం, ఏ వర్గం లేదని చెప్పారు. ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకున్నారని.. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పాతర వేస్తారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలేదన్నారు. తమకు అండగా ఉన్న వారిని వేధిస్తున్నారన్నారు. మీ ఆటలు ఎన్ని రోజులు సాగుతాయని.. టీఆర్ఎస్ ది ఆరిపోయే దీపం అని అన్నారు. హుజూరాబాద్ లో ఎట్లా చెంప చెళ్లుమనిపించినరో.. మొత్తం తెలంగాణాలో కూడా మిమ్మల్ని బొంద పెడతారన్నారు.  పాలమూరు ఎప్పటికీ బీజేపీకి అండగా ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లల్లో బీజేపీని గెలిపిస్తారన్నారు.