కాంగ్రెస్​కు ఈబీసీ సంఘం మద్దతు

కాంగ్రెస్​కు ఈబీసీ సంఘం మద్దతు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి ఈబీసీ సంఘం మద్దతు ప్రకటించింది. అందుకు సంబంధించి సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతునిస్తున్నామని తెలిపారు. ప్రజలెన్నుకున్న సీఎం ప్రజలను కలువకపోవడాన్ని ప్రజాస్వామికవాదులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు.

దీంతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను కేసీఆర్ అణచి వేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిస్తూ..‘కేసీఆర్ కో హఠావో.. తెలంగాణ కో బచావో’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు.