ఈబిజ్ .కామ్ డైరెక్టర్ల ఆస్తుల జప్తు 

ఈబిజ్ .కామ్ డైరెక్టర్ల ఆస్తుల జప్తు 

ఈబిజ్ .కామ్ డైరెక్టర్లకు చెందిన 277 .97 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు జప్తు చేశారు. ఈ ఆస్తులను అటాచ్ చేస్తూ ED అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈబిజ్. కామ్ డైరెక్టర్లు పవన్ మల్హాన్, అనితా మల్హాన్ ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. వీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అక్రమంగా 1,064 కోట్ల రూపాయలను కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఈబిజ్. కామ్ డైరెక్టర్లను సైబరాబాద్  పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.