ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో విచారణ కోసం డిసెంబర్ 21న తమ ముందు హాజరుకావాలని ఈడీ తన నోటీసులలో స్పష్టం చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఈ కేసులో ఒకసారి విచారించగా ఇప్పుడు మరోసారి నోటీసుల పంపింది ఈడీ. ఈ వ్యవహారానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇప్పటికే కేజ్రీవాల్ ను ప్రశ్నించింది.