రేపటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ

రేపటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) కేసును విచారిస్తోంది. రేపటి(మంగళవారం) నుంచి డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. మొదటి రోజున డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. మరో 50 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ 50 మందిని కూడా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించారు. డ్రగ్స్ కొనుగోలు కోసం హవాలా మార్గం ద్వారా డబ్బు విదేశాలకు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఫెమా చట్టాల ఉల్లంఘన కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.