ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ

 ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ

TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఏప్రిల్ 17వ తేదీన చంచల్ గూడ జైల్లో ఈడీ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్లను విచారించడానికి  నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపనుంది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశం నాంపల్లి కోర్టు ఆదేశించింది.

నిందితుల విచారణ నేపథ్యంలో చంచల్ గూడ జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ నాంపల్లి కోర్టు అనుమతించింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతిచ్చిన కోర్టు....ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపర్ డెంట్ ను ఆదేశించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ విచారించనుంది. మొత్తం రెండు రోజుల పాటు నిందితుల వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేసుకోనున్నారు.