అస్సాంలో ఎన్ కౌంటర్.. 8 మంది మిలిటెంట్లు మృతి

అస్సాంలో ఎన్ కౌంటర్.. 8 మంది మిలిటెంట్లు మృతి

అస్సాం రైఫిల్స్ కు డీఎన్ఎల్ఏ తీవ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లను పోలీసులు మట్టుబెట్టారు. వీరిలో ఇంకో ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఏఎస్ ప్రకాశ్ సోనోవాల్ నేతృత్వంలో వెస్ట్ కర్బీ ఆంగ్లాండ్ లో అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 రైఫిల్స్, అమ్యూనిషన్ ను స్వాధీనం చేసుకున్నామని భద్రతా అధికారులు చెప్పారు.