
కరెంట్ బిల్ కట్టడం కోసం విద్యుత్ శాఖ కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో వినియోగదారులు విద్యుత్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల ముందు బారులు తీరాల్సిన శ్రమ లేకుండా అయింది. ఎవరి ఇంట్లో వారే.. మీటర్ రీడింగ్ తీసి.. బిల్ పే చేయొచ్చు. ఇందుకోసం విద్యుత్ శాఖ ‘సెల్ఫ్ మీటర్ రీడింగ్’ అనే యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ గురించి అవగాహన కార్యక్రమాన్నిమల్కాజిగిరిలోని వసంతపూర్ కాలనీలో అధికారులు ఏర్పాటుచేశారు. కరోనా సమయంలో మీటర్ రీడింగ్ తీసుకోవడానికి ఆపరేటర్లను వినియోగదారులు ఇళ్లలోకి అనుమతించడంలేదు. అందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ యాప్ ఏర్పాటుతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ ఏడిఈ, భారత్ యాప్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి పలు కాలనీలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.