
Suzuki Swift: ప్రపంచ వ్యాప్తంగా ఆటో రంగం పెద్ద కుదుపును చూస్తోంది. ప్రధానంగా పర్యావరణ కాలణాలతో గ్రీన్ మెుబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు ప్రజలు, ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా చైనా సుంకాల యుద్ధం ప్రభావం ఆటో రంగాన్ని ప్రభావితం చేస్తోంది. వాస్తవానికి చైనా కొన్ని అరుదైన కనిజాలను ఎగుమతి చేయటంపై ఆంక్షలు విధించటం భారత ఆటో రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
చాలా మంది భారతీయ మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన కార్ మోడల్ సుజుకీ స్విఫ్ట్. అయితే ప్రస్తుతం దీని ఉత్పత్తి ప్రమాదంలో పడింది. వాస్తవానికి మారుతీ సుజుకీ కార్పొరేషన్ తన పాపులర్ కార్ మోడల్ అయిన స్విఫ్ట్ తయారీని నిలిపివేయాలని నిర్ణయించింది. చైనా అరుదైన ఖనిజాల సరఫరాపై ఆంక్షలు పెట్టడమే దీనికి కారణమని తేలింది. చైనా తన ట్రేడ్ పాలసీలో చేసిన మార్పులతు జపాన్ కార్ మేకర్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కొన్ని వారాల ముందు సుజుకీ తన స్విఫ్ట్ మోడల్ కార్ల తయారీని మార్చి 26 నుంచి జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో స్విఫ్ట్ స్పోర్ట్ వెర్షన్ మాత్రం మినహాయించబడింది. అయితే ఈ నిర్ణయం ఎందువల్ల తీసుకున్నారనే విషయంపై మాత్రం కంపెనీ ప్రతినిధులు ప్రకటించటడానికి ఇష్టపడలేదు.
అయితే కంపెనీ గురువారం చేసిన ప్రకటన ప్రకారం జూన్ 13 నుంచి తన సగారా ప్లాంట్లో స్విఫ్ట్ కార్ల తయారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఉత్పత్తి జూన్ 16 నుంచి మెుదలవుతుందని చెప్పింది. ప్రస్తుతం కార్ల తయారీకి అవసరమైన పార్ట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. చైనా ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ మోటార్స్, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర ఉత్పత్తుల తయారీలో వినియోగించే మ్యాగ్నెట్ మెటీరియల్స్ సరఫరాపై కఠిన ఆంక్షలు విధించటంతో ఉత్పత్తి దెబ్బతింది. అనేక యూరోపియన్ ఆటో దిగ్గజాలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొనిన్నాయి. బెంజ్ దీనికి ప్రత్యామ్నాయాలను కనుగొనే పనిలో ఉన్నట్లు తెలింది.