జూన్​ 11 ఏరువాక పౌర్ణమి: ఈ పనులు అసలు చేయవద్దు..

జూన్​ 11 ఏరువాక పౌర్ణమి:  ఈ పనులు అసలు చేయవద్దు..

హిందూ మతంలో  కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత  జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది.  ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి జూన్​ 11న  జరుపుకుంటాము.  ఆ రోజున రైతులు విశ్వావశునామ సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.  ఆ రోజున కొన్ని ఆచారాలతో ముడిపడి ఉందని పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం  జ్యేష్ఠ పౌర్ణమి రోజు కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.   ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .

విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా వివరించారు. సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం.. బీజవాపన మంగళ దివసం వాహన పుణ్ణాహ మంగళం  కర్షణ పుణ్యహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెబుతున్నారు

 గోర్లు, జుట్టు కత్తిరించడం:   జ్యేష్ఠ పూర్ణిమ రోజు జుట్టు.. గోళ్లను కత్తిరించకూడదు. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు.మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం. ఆరోజున జుట్టును.. గోళ్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి.  కుల దైవాన్ని.. భూమాతకు ప్రత్యేకంగా పూజలు జరపాలి. 

మాంసాహారానికి..మద్యానికి దూరంగా ఉండాలి:  జూన్​ 11, 2025 న ఎలాంటి మాంసాహారం తినకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే మద్యం కూడా తాగకూడదు.  ఆ రోజు భూమాతకు ప్రత్యేకమైన రోజు.  జంతువులను కోసేటప్పుడు భూమిపై రక్తం పడుతుంది. అలా పడితే భూదేవికి కోపం వచ్చి.. పంటలు సరిగా పండవని శాస్త్రాలు చెబుతున్నాయి.   మద్యం సేవించడం వలన ఆత్మశుద్దికి విఘాతం కలుగుతుంది. అంతేకాదు.. మాంసం తిన్నా.. మద్యం తాగినా.. చాలామందికి కోపం పెరుగుతుంది.  ఆవేశంలో ఇతరులకు హాని కలుగజేసే అవకాశం ఉంది.   ఆరోజు భగవంతుని ధ్యానిస్తే గడపాలి.  పాలు.. పండ్లు లాంటి సాత్విక ఆహారాన్ని తినాలి.  ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలని పండితులు చెబుతున్నారు. 

యాక్టివ్​ గా ఉండండి:  అన్​ ఈజీగా.. సోమరితనంగా ఉండవద్దు.  ఆ రోజు విందు.. వినోదాలకు దూరంగా ఉండండి.  దేవాలయాలు సందర్శించండి.. ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. 
జ్యేష్ఠ  పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.  ఆరోజు చేయాలనుకున్న పనిని వాయిదా వేయకుండా చేయకుండా చేయండి. 

 నలుపు రంగు దుస్తులు వద్దు:  హిందూ పురాణాల ప్రకారం నలుపు రంగును అశుభ కార్యక్రమాలకు వాడతారు. జ్యేష్ట పౌర్ణమి వంటి పవిత్ర దినాల్లో సాధ్యమైనంత వరకు వాడవద్దు. బ్లాక్​ కలర్​ ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది.  గులాబీ.. పసుపు .. ఆకుపచ్చ రంగులను వాడండి.  ప్రకాశించే రంగులను వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  

తులసి ఆకులను కోయవద్దు : తులసి (పవిత్ర తులసి) ఆకులను ఆదివారాలు లేదా పూర్ణిమ లేదా ఏకాదశి వంటి పవిత్ర దినాలలో కోయకూదు. తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం.  ఆరోజు తులసి చెట్టును అంటుకుంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది.  అందుకే ఆరోజు తులసి ఆకులను కోయకూడదని పండితులు చెబుతున్నారు.