
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు, మిగిలిన జిల్లాల్లోని 4 బార్లకు నోటిఫికేషన్ ముగిసింది. బార్లను దక్కించుకునేందుకు అప్లికేషన్లు భారీగా వచ్చాయి. GHMC లోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. మిగతా జిల్లాల్లోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖకు 36.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు, మిగిలిన జిల్లాల్లోని 4 బార్లకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్. జూన్ 6 దరఖాస్తుల చివరి తేదీగా ప్రకటించారు. దీంతో మొత్తం 28 బార్లకు గానూ.. 3668 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
బార్లను దక్కించుకునేందుకు అప్లై చేసుకునేందుకు ఉత్సాహకులు పోటీపడ్డారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 24 బార్లకు 3520 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి.ఈ మొత్తం 28 బార్లకు దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 36.68 కోట్ల ఆదాయం వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ డ్రా ద్వారా యజమానులను ఎంపిక చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ జలపల్లి మున్సిపాలిటీలో బారుకు 57 దరఖాస్తులు, మహబూబ్ నగర్ లో 49, నిజామాబాద్ లో 27, నిజామాబాద్ జిల్లా బోధన్ లో 15 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్లు డ్రా ద్వారా బార్ యజమానులను ఎంపిక చేస్తారు. ఈనెల 13న బార్లకు డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్ ని ఎంపిక చేయడం జరుగుతుందని , డ్రా ఎక్కడెక్కడ అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ వెల్లడించారు.