Gold Rate: శుభవార్త: కుప్పకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో రూ.వెయ్యి 630 తగ్గిన తులం

Gold Rate: శుభవార్త: కుప్పకూలిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో రూ.వెయ్యి 630 తగ్గిన తులం

Gold Price Today: దిగజారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈవారం మెుదటి నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తులం బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల చేరువకు చేరుకుని అందరినీ షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత వారాంతంలో గోల్డ్ రేట్లు భారీగా తగ్గటంపై భారతీయ కొనుగోలుదారులు ఊరటను పొందుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.15 వేలు భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 980, ముంబైలో రూ.8వేల 980, దిల్లీలో రూ.8వేల 995, కలకత్తాలో రూ.8వేల 980, బెంగళూరులో రూ.8వేల 980, కేరళలో రూ.8వేల 980, వడోదరలో రూ.8వేల 985, అహ్మదాబాదులో రూ.8వేల 985, జైరూపురులో రూ.8వేల 995, మంగళూరులో రూ.8వేల 980, నాశిక్ లో రూ.8వేల 983, అయోధ్యలో రూ.8వేల 995, బళ్లారిలో రూ.8వేల 980, నోయిడాలో రూ.8వేల 995, గురుగ్రాములో రూ.8వేల 995గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.16వేల 300 తగ్గింపును నమోదు చేసింది.  దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 797, ముంబైలో రూ.9వేల 797, దిల్లీలో రూ.9వేల 812, కలకత్తాలో రూ.9వేల 797, బెంగళూరులో రూ.9వేల 797, కేరళలో రూ.9వేల 797, వడోదరలో రూ.9వేల 802, అహ్మదాబాదులో రూ.9వేల 802, జైరూపురులో రూ.9వేల 812, మంగళూరులో రూ.9వేల 797, నాశిక్ లో రూ.9వేల 800, అయోధ్యలో రూ.9వేల 812, బళ్లారిలో రూ.9వేల 797, నోయిడాలో రూ.9వేల 812, గురుగ్రాములో రూ.9వేల 812 వద్ద ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 970గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 18వేల వద్ద ఉంది.