పీఆర్సీ అమలు చేయాలి..లేదంటే సమ్మెకు దిగుతాం

పీఆర్సీ అమలు చేయాలి..లేదంటే సమ్మెకు దిగుతాం

పీఆర్సీని ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగులు పోరు బాట పట్టారు.  పీఆర్సీని అమలు చేయాలన్న  తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్  మేరకు  కూకట్ పల్లి,కొండాపూర్, గచ్చిబౌలి  డివిజన్ లోని  ఉద్యోగుల  ఆధ్వర్యంలో   KPHB  కాలనీలోని విద్యుత్ సంస్థ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2022 ఏప్రిల్ వరకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  పీఆర్సీని వెంటనే అమలు చేయాలని..లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు సైతం దిగుతామని అల్టిమేటం జారీ చేశారు.  ఈ ధర్నాలో  డీఈలు, ఏఈలు సహా మొత్తం 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.