
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యా రెడ్డి
బషీర్బాగ్, వెలుగు: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అన్నారు. మహిళా సేన ఆధ్వర్యంలో అబిడ్స్ జయ ఇంటర్నేషనల్ హోటల్లో మూడు రోజులు నిర్వహించనున్న మహిళా సాధికారత ఎగ్జిబిషన్ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామితో కలిసి ఆదివారం ప్రారంభించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.