జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్ము కశ్మీర్  బారాముల్లాలో  పోలీసుల ఎన్ కౌంటర్  కొనసాగుతోంది. లష్కరే తోయిబాకు  చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. జిల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం సాయంత్రం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని ఆయన చెప్పారు.

ఏకే రైఫిల్,  రెండు మ్యాగజైన్లు,  30 రౌండ్ల  బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.  అలాగే  హందిపొరాలోని  రఫియాబాద్  చెక్ పోస్టు దగ్గర తప్పించుకున్న  మరో ఇద్దరు  ఉగ్రవాదులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉగ్రవాదుల  నుంచి రెండు  గన్నులు, రెండు  మ్యాగజైన్లు ..11 లైవ్  కాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.