పదేళ్ల క్రితం ‘వాడు వీడు’ చిత్రంతో మెప్పించిన విశాల్, ఆర్య ఇప్పుడు ‘ఎనిమి’స్ గా వస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకుడు. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్తో ఆకట్టుకున్న టీమ్.. నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో విశాల్, ఆర్య ఇద్దరూ అదరగొట్టేశారు. చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్గా పెరిగిన విశాల్, ఆర్య పెద్దయిన తర్వాత శత్రువులుగా మారతారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న ఇండియన్స్, అలాగే ఫారిన్లో సమస్యలు సృష్టించే నెగెటివ్ రోల్లో ఆర్యను చూపించిన విధానం ఆకట్టుకుంది. ‘పోటీ అంటూ వచ్చాక ఇద్దరూ శత్రువులుగానే ఉండాలి. మిగతా సమయాల్లో బెస్ట్ ఫ్రెండ్స్, నొప్పిని భరించేవాడే లైఫ్లో గెలవగలుగుతాడు. అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు’ అని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే విశాల్, ఆర్య మధ్య జరిగే యాక్షన్ సీన్స్తో పాటు బ్యాగ్రౌండ్ స్కోరు ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.