రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

విదేశాల్లో అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్‌ కేసులో కాం‍గ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం ED ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లండన్‌లో 2 కోట్ల పౌండ్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన క్రమంలో వాద్రాపై మనీల్యాండరింగ్‌ కేసు తో పాటు ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రంలో బికానేర్‌లోని ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగాయని వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వాద్రాకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని కూడా వాద్రాను కోర్టు ఆదేశించింది.