విదేశాల్లో అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం ED ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లండన్లో 2 కోట్ల పౌండ్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన క్రమంలో వాద్రాపై మనీల్యాండరింగ్ కేసు తో పాటు ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రంలో బికానేర్లోని ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగాయని వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైంది. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని కూడా వాద్రాను కోర్టు ఆదేశించింది.