5వ టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

5వ టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

లండన్: నాలుగో టెస్టులో ఘోర పరాభవంతో సిరీస్ లో వెనుకబడిపోయిన ఇంగ్లండ్ అప్పుడే 5వ టెస్టుపై దృష్టి సారించింది. మాంచెస్టర్ లో ఈ నెల 10న ప్రారంభం కానున్న సిరీస్ లో చివరి 5వ టెస్టు మ్యాచ్ కోసం జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టులో ఊహించినట్లే వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి వచ్చారు. తన భార్య డెలివరీ వల్ల బట్లర్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడలేకపోగా.. బ్యాట్స్ మన్ శామ్ బిల్లింగ్ ను మాత్రం పక్కన పెట్టారు. 
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. కోహ్లీ సేన చేతిలో 2-1 తేడాతో వెనుకబడిన ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకునేందుకు ఎదురు చూస్తోంది. ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ చివరి టెస్టుకు ఆడబోయే ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. 
ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, హసీబ్ హమీద్,  మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, శామ్ కరన్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, క్రెయిగ్ ఒవెర్టన్.