పబ్లిక్​ను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నరు

పబ్లిక్​ను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రం అవార్డులు ఇస్తుంటే, స్టేట్​ లీడర్లు మాత్రం ఫేక్​ లెటర్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గాంధీ జయంతి రోజున రాష్ట్రానికి  అవార్డులు రావడం సంతోషకరమన్నారు. అవార్డులను అందుకున్న పీఆర్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, రూరల్ డెవలప్ మెంట్ స్పెషల్ కమిషనర్​ ప్రసాద్, కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్, పలువురు సర్పంచ్ లు, సెక్రటరీలను ఖైరతాబాద్ లోని తన ఆఫీస్​లో సన్మానించారు. సర్కారు పనితీరు బాగుండటంతోనే అవార్డులు వచ్చాయని మంత్రి అన్నారు.

మిషన్ భగీరథపై 320 గ్రామాల్లో 150 సెంట్రల్ టీమ్స్​ పరిశీలించి రిపోర్ట్ ఇచ్చాయని, వాటి ఆధారంగా కేంద్రం అవార్డులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్లిస్తున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటులో చెప్పారన్నారు.