
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మలమ్మ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్తో ఎరుపు రంగు చీరలో కనిపించారు. బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
2019లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజున చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయి’ అని చెప్పారు.
2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. అలాగే 2021లో ఎరుపు-గోధుమ రంగుతో ఉన్న భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ-బంగారు కలర్ లో ఉన్న చీరలో కనిపించారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్కు అనుగుణంగా దీనిని ధరించారు. ఇక 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు.