రంగారెడ్డి, వెలుగు: రాజేంద్రనగర్లో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గోడౌన్లను రంగారెడ్డి జిల్లా ఎన్నికల అబ్జర్వర్బి.తిల్లైవెల్ కలెక్టర్హరీశ్తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. పుదుచ్చేరికి చెందిన బి.తిల్లైవెల్ను ఇటీవల జిల్లా అధికారిగా నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలుకు టైం దగ్గర పడుతోందని, ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, బ్యాటరీలు మార్చి సిద్ధం చేయాలని సూచించారు.