వైసీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

వైసీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ నేడు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే హ‌ర్ష‌కుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి అమలాపురం సీటు ద‌క్కుతుంద‌ని ఆయన ఆశించారు. కానీ ఆ సీటు దక్కకపోవడంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.