న్యూ ఇయర్ సందర్భంగా రేపు మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. జనవరి 1న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ డ్రైవ్లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని మెట్రో అధికారులు వెల్లడించారు. తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెట్రో అధికారులు సూచించారు.