8న ఈడీ విచారణకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

8న ఈడీ విచారణకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌  డిసెంబరు 8న  విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న ఆదివారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మస్కట్ వెళ్లేందుకు ఎయిర్‌‌పోర్టుకు వెళ్లిన ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే మస్కట్ వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం ఆమె ముంబై ఎయిర్‌‌పోర్టుకు చేరుకోగా.. లుకౌట్‌ నోటీసులు ఉండడంతో దేశం విడిచి వెళ్లకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించినట్లు తెలుస్తోంది.