మారండ్రా బాబూ : ప్రాంక్ వీడియోలు కూడా కాపీ కొడుతున్న పాకిస్తాన్..

మారండ్రా బాబూ : ప్రాంక్ వీడియోలు కూడా కాపీ కొడుతున్న పాకిస్తాన్..

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదని సామెత ఉంది.  అలాగే ఇప్పడు కంప్యూటర్ పుణ్యమా అని హైటెక్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని అది ఏ వార్త అయినా జనాలకు ఇట్టే తెలిసిపోతుంది.  ఇప్పుడు పాక్ ప్రజలు వైరల్ చేసిన వీడియో... వారి డొల్లతనాన్ని బయటపెట్టింది.  ఇక అంతే కాదు దానిపై ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు కామెంట్లు కూడా పెడుతున్నారు.  అయితే ఇప్పుడు మన సోదర దేశం.. పాకిస్తాన్  మనపై కాలు దువ్వినా.. ఆ దేశం నుంచి సోషల్ మీడియాలో పోస్టైన వీడియో మాత్రం తమ దేశం సాధించిన గొప్పని చెపుతుంది.  కాని దానిని క్షుణ్టంగా పరిశీలిస్తే భారతదేశంలో ఓ ప్రదేశంలో గుంతలు పడిన రోడ్డును పోస్ట్ చేసి తమ దేశస్థులు సాధించిన ఘనతని అబద్దాలు చెప్పడంలో కూడా ఆరితేరింది. దీనిని చూసిన నెటిజన్లు ఇక మీరు మారరా  అని నవ్వుకుంటున్నారు. 

ఈ వీడియోలో  వ్యోమగామి వేషధారణలో ఓ వ్యక్తి చంద్రుడిపై నడుస్తున్నట్లుగా కనపడతాడు.  అయితే అతని వెనుక ఆటో వెళుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనపడుతుంది.  ఈ వీడియో పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో షేర్ అయింది.  వైరల్ అవుతున్న వీడియో క్యాప్షన్‌లో అది పాకిస్థాన్‌కు చెందినది అని పేర్కొంది.  చంద్రునిపై నడుస్తున్న తొలి పాకిస్తానీ  అతనే అని రాశారు.  దీనిని చూసిన ఆ దేశస్థులు తెగ వైరల్ చేయడం మొదలు పెట్టారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UMT memer (@umt.memer)

పాకిస్తాన్ దేశస్థులు వైరల్ చేసిన వీడియోలో  వారు చెప్పే వ్యోమగామి వెనుక నుండి ఆటో  కదులుతున్నట్టు ఉంది.  ఇంకా కార్లు కూడా కనిపించాయి.  ఈ వీడియో గురించి నెటిజన్లు ఇంటర్ నెట్ లో  అన్వేషించడం మొదలు పెట్టారు.  ఈ వీడియో చాలా గుంతలో ఉన్న రహదారి క్లిప్.  అయితే అది పాకిస్తాన్ కు చెందిన వీడియో కాదు.   ఈ వీడియో భారతదేశానికి చెందిన బెంగళూరుకు చెందినదని గుర్తించారు. ఈ వీడియోను ఆర్టిస్ట్ బాదల్ నంజుండస్వామి అనే వ్యక్తి రికార్డ్ చేసి .. గుంతలు పడిన రోడ్డు విషయం     అధికారులకు తెలిసేలా స్వామి వ్యోమగామి వేషధారణలో ఉన్న వీడియోను  పోస్టు చేశారు.

 పాకిస్తాన్ మన దేశానికి సంబంధించిన వీడియోలను కూడా తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎంతగా శ్రమిస్తుందో మరి.  నిజానికి పాకిస్తాన్ కు చంద్రయాన్ కు ఎలాంటి సంబంధం లేదు,  కాని  తామే గొప్ప అని చెప్పుకొనేందుకు చేసిన మన దాయాది దేశం చేసిన  ప్రయత్నం విఫలం కావడంతో  మరోసారి భారత్ తో పెట్టుకొని బొక్క బోర్లాపడింది.  భారత్ ఆర్మీనే కాదు.. సామాన్య ప్రజలు కూడా పాకిస్తాన్  ఆలోచించే దుందుండుకు చర్యలకు కళ్లెం వేస్తున్నారు.   బెంగళూరులోని గుంతల  రోడ్లకు .. అంతరిక్షంలో చంద్రుడి ఉండే ప్రాంతానికి కూడా తేడా తెలియని దుస్థితిలో పాకిస్థాన్ ప్రజలు కొంతమంది (సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేసిన పాకిస్తాన్ ప్రజలు) ఉన్నారా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.