ఆవుల మందకు ఆకలైందని.. తన తోటనే మేతగా వేశాడు

ఆవుల మందకు ఆకలైందని.. తన తోటనే మేతగా వేశాడు

గుజరాత్ లోని ఓ రైతు జంతు ప్రేమ చూపించాడు. తాను నష్టపోతానని తెలిసినా కూడా… మూగజీవాల కోసం భరించాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజ్ కోట్ లో ఉండే ఓ రైతు… ఆవులపై తన మమకారం చాటుకున్నాడు. ఆవులు మేపుతున్న ఓ కాపరి… వాటికి ఆకలి తీర్చలేకపోతున్నానని  .. 3 రోజులు తిండిలేక అలమటిస్తున్నాయని రైతుకు చెప్పాడు. జాలితో ఆ రైతు.. వాటిని తన వెంట తీసుకురావాలన్నాడు. అలా.. తన తోట దాకా తీసుకొచ్చాడు. ఎదుగుతున్న ఆ పంటను.. ఆవులకు ఆహారంగా వేశాడు. మందలోని దాదాపు 40, 50 ఆవులను తోటలోకి వదిలాడు.

ఆ రైతుకు .. పశువుల కాపరులు ధన్యవాదాలు చెప్పారు. దేవుడు నిన్నూ, నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడంటూ ఆకాంక్షించారు.

ఈ వీడియో చూసిన అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మంచి పని చేశాడని అంటున్నారు.