Mamitha Baiju: హారతి ఇచ్చిన తెలుగు అభిమాని..ప్రేమలు మమితా బైజు ఫిదా

Mamitha Baiju: హారతి ఇచ్చిన తెలుగు అభిమాని..ప్రేమలు మమితా బైజు ఫిదా

నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్కు తెగ ఫిదా అవుతున్నారు యూత్. ముఖ్యంగా ఇందులో మమితా బజు హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. 

లేటెస్ట్గా ప్రేమలు సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంటరాక్ట్లో భాగంగా మమిత బైజు(Mamitha Baiju)అరుదైన తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ని చూసింది.ఓ తెలుగు అభిమాని ఆమెకు ఏకంగా హారతి ఇచ్చేశాడు.ప్రేమలు సినిమా చూసినప్పటి నుంచి మీ హెయిర్ స్టైల్ కి..హ్యూమరస్ యాక్టింగ్ కి ఫిదా అయ్యాను. దీంతో మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినట్లు చెప్పాడు.

అంతేకాదు నా అభిమానాన్ని మీకు చూపెట్టాలనుకుంటున్న అంటూ మనసారా హారతి ఇచ్చేశాడు.  ఇక అక్కడున్న వారంతా చూసి వావ్ వాట్ ఏ జెన్యూన్ ఫీలింగ్ అంటూ చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం  అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మీరు కూడా చూసెయ్యండి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmy Hunt (@filmyhuntlive)

దర్శ క ధీరుడు రాజమౌళి కూడా మమితా బజు నటనపై ప్రశంసలు కురిపించారు.'గీతాంజలి ఫేం గిరిజ, సాయి పల్లవి లానే మమిత కూడా యూత్ హార్ట్ త్రోబ్ అవుతుంది..అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు.

ఈ కేరళ కుట్టీ మమితా బజు 2017లో ఓ మలయాళ మూవీ ద్వారా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ..కేరళ ప్రేక్షకులను ప్రతి క్యారెక్టర్ తో అలరించింది. అంతేకాదు తన యాక్టింగ్ కు గాను ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

టీనేజ్ గర్ల్ అయిన మామితా ఇప్పటి వరకు 16 సినిమాలు చేసి యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు ప్రేమలు మూవీతోను తెలుగులో మంచి ఫ్యాన్ ఫాల్లోవింగ్ ని సొంతం చేసుకుంది.

రీసెంట్గా మమితా బజు కోలీవుడ్ లో రెబల్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్ కు జోడీగా నటించింది. నికేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు విష్ణు విశాల్- రామ్ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో లీడ్ రోల్ పోషించనుంది. ఇప్పుడు తెలుగులో కూడా ప్రేమలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి..ఆఫర్లు అందుకుంటుంది.

అయితే, ఇప్పటికే కేరళ నుంచి సాయి పల్లవి, అనుపమ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. దీంతో మమితా బజు ఆచూతూచి మంచి కథలను ఎంచుకోవాలని సినీ వర్గాలు చెబుతున్నాయి.