దోచేస్తున్నారు.. కలెక్టర్‌కు పరకాల రైతు ఫోన్

దోచేస్తున్నారు.. కలెక్టర్‌కు పరకాల రైతు ఫోన్

ఆరుగాలం కష్టపడి పడించిన ధాన్యం అమ్ముతుంటే.. కోతల పేరుతో దోచేస్తున్నారంటూ గోడు వెళ్లబోసుకున్నాడు ఓ రైతు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ కు పరకాల మండలం లక్ష్మీపురంకు చెందిన రైతు సతేందర్ రెడ్డి ఫోన్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై స్పందించాలని కోరారు. క్వింటాల్ వడ్లకు 15కిలోల కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. చివరకు బాధ కలిగించి వ్యవసాయం వదులుకుంటానని ప్రమాణం చేశానని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు రైతు సతేందర్ రెడ్డి. స్పందించిన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సీసీతో ఫోన్ చేయిస్తానని హామీ ఇచ్చారు.