కాటేసిన కరువు..రైతన్న ఆత్మహత్య

కాటేసిన కరువు..రైతన్న ఆత్మహత్య

తెలంగాణలో కరువు కాటేస్తుంది. సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేది ఏం లేక అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సాగు నీరు అందక పొలం ఎండిపోవడంతో జగిత్యాల జిల్లా తిప్పన్నపేట్ గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చయ్య అనే రైతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యచేసుకున్నాడు.