మెట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

మెట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ కాన్వాయ్ పైకి ఓ రైతు చెప్పు విసిరాడు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి పరుగెత్తి చెప్పు విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మెట్ పల్లిలో ఇవాళ  మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రైతులను ముందస్తు అరెస్టులు చేసి మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు  కేటీఆర్ కాన్వాయ్ పోలీస్ స్టేషన్ ముందు  నుంచి వెళుతుండగా రైతు పరుగెత్తి చెప్పు విసిరాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.