పట్టాబుక్కు కోసం తనను తాను పాతిపెట్టుకున్న రైతు

పట్టాబుక్కు కోసం తనను తాను పాతిపెట్టుకున్న రైతు

పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు తనను తాను మట్టిలో పాతిపెట్టుకొని నిరసర తెలిపారు. నరసింహులపేట మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ రెడ్డికి వారసత్వంగా వచిచన 4.39 ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం చాన్నాళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతో పొలం వద్ద ఛాతివరకు గొయ్యి తవ్వకుని అందులో తనను ఉపూడ్చుకొని నిరసన చేపట్టాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవి వెంటనే పాసు బుక్​ అందించారు. దీంతో రైతు ఆందోళన విరమించాడు.