
అయిజ, వెలుగు: మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రానికి వారం రోజుల కింద భారీగా ఏపీ వడ్లు రాగా, రైతులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేస్తుండగానే, బుధవారం కర్నూలు జిల్లా నాగలదిన్నె నుంచి రెండు ట్రాక్టర్లలో వడ్లు పులికల్ గ్రామానికి తీసుకువచ్చారు.
రైతులు ఏఈవో శివకుమార్ కు సమాచారం ఇవ్వగా, ఆయన వడ్ల కుప్పను పరిశీలించి కొనుగోలు నిలిపివేశారు. వ్యాపారులు, సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై ఏపీ నుంచి వడ్లు తీసుకువచ్చి బైనపల్లి కొనుగోలు కేంద్రంలో అమ్ముతున్నారని రైతులు చెబుతున్నారు.