ఫిబ్రవరి 29 వరకు డిల్లీ చలో పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతులు శుక్రవారం ప్రకటించారు.నిరసనలో ఉన్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 29 తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఖనేరి సరిహద్దులో విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్బన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ తమ తదుపరి వ్యూహాన్ని ఫిబ్రవరి 29 న ప్రకటిస్తామని చెప్పారు.
రైతు సుభకరన్ సింగ్ మృతిపై పంజాబ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయని పక్షంలో నిరసనకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఏక్తా నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ అన్నారు. పంజాబ్లోని భటిండాకు చెందిన శుభకరన్ సింగ్ (22) ఫిబ్రవరి 21న హర్యానా పోలీసులతో జరిగిన ఘర్షణలో మరణించాడు. కొందరు రైతులు పోలీసుల టియర్ గ్యాస్ షెల్లో అతను చనిపోయాడని ఆరోపించారు.