రైతులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ

రైతులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ

నల్గొండ జిల్లాలో చర్లగూడెం రిజర్వాయర్ పనులు జరిగే ప్రాంతంలో రైతులు నిరసనకు దిగారు. తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే.. చర్లగూడెం రిజర్వాయర్ పనులు కొనసాగించాలంటూ అధికారులను రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పనులకు అడ్డుపడొద్దని పోలీసులు అన్నారు. ఐతే... తమకు నష్టపరిహారం రాకపోతే చావు తప్ప మరో దారి లేదని రైతులు పోలీసులతో చెప్పారు. రైతులు తమ గోడు చెప్పుకుంటున్న టైంలోనే... మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ మర్రిగూడెం ఎస్సై క్రాంతికుమార్ రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పనులను అడ్డుకుంటే చట్టప్రకారం చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.