పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై వరుస సినిమాలను నిర్మిస్తున్నారు టీజీ విశ్వ ప్రసాద్. ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ ఆయన టార్గెట్ అని చెబుతున్నారు. ఆయన నిర్మిస్తున్న చిత్రాల్లో ‘రామబాణం’ ఒకటి. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ మే 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘అమెరికాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడే సినిమాలపై ప్యాషన్ ఉండేది. దాదాపు పదేళ్ల క్రితమే పక్కా ప్లానింగ్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను. వివిధ భాషల్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలనేది నా కోరిక. ఇక ‘రామబాణం’ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ పరిశీలించాం.
బాలకృష్ణ గారు ఈ టైటిల్ను సజెస్జ్ చేశారు. అన్నదమ్ముల కథ కావడంతో, టైటిల్ సరిగ్గా సరిపోతుందని దీన్నే ఫైనల్ చేశాం. గోపీచంద్ బ్రదర్గా జగపతిబాబు ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఖుష్బూ కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. అవుట్ పుట్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో హాట్రిక్ సాధిస్తారనే నమ్మకం ఉంది. ప్రతి హీరోతో వర్క్ చేయాలనేది మా బ్యానర్ ఉద్దేశం. కథ నచ్చి డేట్స్ ఇస్తే.. చిరంజీవి, బన్నీతోనూ తప్పకుండా సినిమాలు చేస్తాం’ అని అన్నారు.