ఘోర ప్రమాదం... గోవాకు పోతున్న యువకుల కారుకు యాక్సిడెంట్..

ఘోర ప్రమాదం... గోవాకు పోతున్న యువకుల కారుకు యాక్సిడెంట్..

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై టస్కర్ వాహనం బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ Exit 17 వద్ద ఆగి ఉన్న ఓ కారును టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన యువకులు ఐదుగురు కారులో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. 

కారులో ప్రయాణిస్తున్న బొరబండ ప్రాంతానికి చెందిన అనిల్ అనే యువకుడు మృతి చెందినట్టు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ నిద్ర మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.