వాగులో తండ్రీకొడుకు గల్లంతు

వాగులో తండ్రీకొడుకు గల్లంతు

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాగుదాటుతుండగా తండ్రీకొడుకులిద్దరు గల్లంతయ్యారు. గొల్లపల్లి మండలం నందిపల్లి నుండి మల్లన్నపేట్ గ్రామానికి గంగమల్లు తన ఏడేళ్ల కొడుకు విష్ణుతో కలిసి వాగు దాటుతుండగా తండ్రీకొడుకులిద్దరూ వరదకు కొట్టుకుపోయారు. కొడుకు విష్ణు మృతదేహం లభ్యం కాగా.. తండ్రి గంగమల్లు కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.